
రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్/రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారని. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కేంద్రం వైఖరిని నిలదీస్తూ. కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 20న అన్ని గ్రామాలలో నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ విప్ & MLA ఆలేరు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మలను దగ్దం చేయాలన్నారు.నియోజక వర్గం లోని అన్ని మండలాలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కేంద్రం వైఖరి పట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణులకు. గ్రామ, గ్రామాలవారిగా దిశానిర్దేశం చేయాలన్నారు .ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులెత్తయడంతో. ఈ విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించాలన్నారు .